ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు
హాజీపూర్, అక్టోబర్ 9 : మంచికి మారు పేరు మంచిర్యాల అని, ఇలాంటి ప్రాంతంలో గుండాలకు, రౌడీలకు ఎన్నటికీ ప్రజలు స్థానం కల్పించబోరని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. హాజీపూర్ మండలంలోని పెద్దంపేటకు చెందిన మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ రావు, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ 20 మంది అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేశారు. శనివారం ఎమ్మెల్యే దివాకర్రావు తన నివాసం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తప్పు చేసిన వారిని ప్రజలు క్షమించరని తెలిపారు. తప్పు చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని సూచించారు. తన సవాలుకు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అనంతరం పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, హాజీపూర్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్లు మల్రాజు రామారావు, కొట్టె సత్తయ్య, వెంకటేశ్, మండల ప్రధాన కార్యదర్శి మాధవరపు జీవన్ రావు, ఉపాధ్యక్షుడు అల్లంల నాగయ్య, యవత ప్రధాన కార్యదర్శి హరీశ్ గౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గోళ్ళ శ్రీనివాస్, సర్పంచ్లు ఆనె మల్లేశ్, కొట్టె మహేందర్, ఎంపీటీసీ వెంకటేశ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు తిరుపతి, మండల నాయకులు వోలపు రమేశ్, బేతు రవి, తదితరులున్నారు.