ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి
గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలి
అధికారులతో సమీక్షలో కలెక్టర్ భారతీ హోళికేరి
సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 9 : రైతులకు ఇబ్బందుల్లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సీసీసీ సింగరేణి అతిథి గృహంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలన్నారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని కేంద్రాల వద్ద తాగునీరు, నీడ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. జిల్లాలో 250 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈసారి జిల్లా నుంచి 2 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం వచ్చే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రాల వద్ద గన్నీ సంచులను అం దుబాటులో ఉంచాలని, ప్రస్తుతం 20 లక్షల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం నుంచి మరో 10 లక్షల సంచులు రావాల్సి ఉందన్నారు. రవాణా చేసేందుకు అవసరమైన వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో 18 రైస్ మిల్లులు ఉండగా, లక్షా 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సామర్థ్యం ఉందని, మిగతా ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు ఇతర జిల్లాలకు పం పిస్తామని తెలిపారు. రైతులకు ధాన్యం రవాణా, తేమశా తం, కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యే దివాకర్రావు, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ప్ర జాప్రతినిధులు, అధికారులు, రైస్ మిల్లర్లు హాజరయ్యారు.
బ్లడ్ స్టోరేజ్ క్యాబినెట్స్ల ప్రారంభం
మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 9 :జిల్లా కేంద్రంలోని సర్కారు దవాఖానలోని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రక్తనిధి కేం ద్రంలో డీఎంఎఫ్టీ నిధులు రూ.10,14,500 లతో కొను గోలు చేసిన బ్లడ్ స్టోరేజ్ క్యాబినెట్స్లను కలెక్టర్ భారతీ హోళికేరి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రక్తాన్ని నిల్వ చేసేందుకు బ్లడ్ స్టోరేజ్ క్యాబినెట్స్ ఏర్పాటు చేశామన్నారు. రక్త నిల్వలు తగ్గకుండా చూడాలని కమిటీ సభ్యులకు సూచించారు. జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ అరవింద్, ఆర్ఎంవో అనిల్ కుమార్, రెడ్క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ చందూరి మహేందర్, జిల్లా కమిటీ సభ్యులు వ్యాస్భట్, రాధాకృష్ణ, రక్తనిధి వైద్యురాలు చంద్రకళ, డాక్టర్ సయ్యద్ అజీమొద్దీన్, బ్లడ్బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.