ఎమ్మెల్యే దివాకర్రావు
గూడెంలో యూపీహెచ్సీ ప్రారంభం
దండేపల్లి, ఏప్రిల్ 9 : తెలంగాణ సర్కా రు చేపట్టిన సంస్కరణల ఫలితంగా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. మండలంలోని గూడెం గ్రామం లో శుక్రవారం ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆయ న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యమే ధ్యే యంగా ప్రభుత్వం సర్కారు దవాఖానలను ఆధునీకరించిందన్నారు. ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు నార్మల్ డెలివరీలను ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు కృషిచేస్తున్నదన్నారు. గ్రామస్తులు ఆరోగ్య ఉప కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో ఏఎన్ఎంలు అం దుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ గురువయ్య, ఎంపీటీసీ తోట మోహన్, దండేపల్లి, తాళ్లపేట పీహెచ్సీల వైద్యులు సునీల్, స్ఫూరణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేని శ్రీనివాస్, సహకార సంఘం అధ్యక్షుడు సురేశ్, సర్పంచ్ గడికొప్పుల రజిని, టీఆర్ఎస్ నాయకులు, ఏఎన్ఎంలు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.