ఎదులాపురం,జూన్ 6 : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 562 మందిపై కేసులు నమోదు చేశామని జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జిల్లా కేంద్రంలోని లాక్డౌన్ను ఆ దివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రజలు అనవసరంగా రోడ్లపై తిరగవద్దన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ ని బంధనలు పాటించి కరోనా కట్టడికి సహక రించాలని కోరారు. ఆయన వెంట ఓఎస్డీ హర్షవర్ధన్ శ్రీవాస్తవ్, అదనపు ఎస్పీ వినోద్ కుమార్,1 డీఎస్పీలు వెంకటేశ్వరరావు, ఉమా మహేశ్వరరావు, వీపూరి సురేశ్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
ఒకరిపై ..
తాండూర్, జూన్ 6 : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కిరణ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోయపల్లిలో ఆదివారం రాత్రి ఓ పెళ్లి జరిగింది. అక్కడికి వెళ్లి పరిశీలించగా పరిమితికి మిం చి జనం ఉన్నారని, దీంతో ఇంటి యజమానిపై కేసు నమో దు చేశామని తెలిపారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.
రామకృష్ణాపూర్లో సీపీ పరిశీలన..
రామకృష్ణాపూర్, జూన్ 6: కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం రాత్రి 10 గంటలకు రామకృష్ణాపూర్లో లాక్డౌన్ అమలు తీరు ను పరిశీలించారు. అనవసరంగా బయట తిరుగుతున్న ఆకతాయిలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సడలింపు సమయం తర్వాత బయట తిరుగుతున్న వారికి ర్యాపిడ్ టెస్ట్లు చేయాలని, పాజిటివ్ వస్తే ఐసొలేషన్ కేంద్రాలకు తరలించాలని పోలీసులను ఆదేశించారు. మందమర్రి సీఐ ప్ర మోద్రావు, రామకృష్ణాపూర్ ఎస్ఐ సంజీవ్, మందమర్రి, దేవాపూర్ ఎస్ఐలు భూమేశ్, విజేందర్, సిబ్బంది ఉన్నారు.