తాండూర్, ఆగస్టు 5 : తల్లి పాలే శ్రీరామరక్ష అని, శిశువుకు ఏడాదిన్నర వయస్సు వచ్చే వరకు పట్టించాలని గర్భిణులు, తల్లులకు ఐసీడీఎస్ సూపర్వైజర్లు, ప్రజాప్రతినిధులు సూచించారు.
హాజీపూర్, ఆగస్టు 5 : జిల్లా కేంద్రంలోని ఏసీసీ 4వ అంగన్వాడీ సెంటర్లో తల్లి పాల వారోత్సవాలను గురువారం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ లావణ్య మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు ముర్రుపాలను పట్టించడంతో ఆరోగ్యకరంగా ఉంటారని తెలిపారు. అనంతరం వార్డులో అవగాహనర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, బాలింతలు, గర్భిణులు పాల్గొన్నారు.
తాండూర్ మండలంలో..
మండలంలోని తాండూర్, మాదారం సెక్టార్లలోని అన్ని అంగన్వాడీ సెంటర్లలో గురువారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు తల్లి పాల ఆవశ్యకత, పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో సూపర్వైజర్లు మమత, రమాదేవి, ప్రజాప్రతినిధులు, మండలంలో అన్ని సెంటర్ల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
వేమనపల్లి మండలంలో..
వేమనపల్లి, ఆగస్టు 5 : మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుబిడె మధూకర్ మాట్లాడుతూ శిశువు పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలని అప్పుడే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ పద్మ, అంగన్వాడీ టీచర్లు దాసరి రాణి, జయసుధ, లక్ష్మి, ఆయాలు , తల్లులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి పట్టణంలో..
బెల్లంపల్లిటౌన్, ఆగస్టు 5 : ప్రపంచవ్యాప్తంగా 40 శాతం కంటే తక్కువ మంది తల్లులే నవజాత శిశువులకు ఆరు నెలలు వచ్చే వరకు తల్లిపాలు ఇస్తున్నారని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కన్నాల సెక్టార్ అంగన్వాడీ సూపర్వైజర్ మమత, సృజన ఆందోళన వ్యక్తం చేశారు. బెల్లంపల్లిలోని పోస్టాఫీస్ బస్తీ-2, కాంట్రాక్టర్ బస్తీ, 65 డిప్ బస్తీలలో గురువారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అనిత, గురుండ్ల లక్ష్మి, హెల్త్ సూపర్వైజర్ డీ.మహాలక్ష్మి, ఆర్పీ రాపెల్లి అన్నపూర్ణ, టీచర్లు సరోజిని, అనంతలక్ష్మి, ఆశ కార్యకర్తలు రేణుక, పద్మ, కే.పద్మావతి, ఆయాలు ధనలక్ష్మి, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.