ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఎదులాపురం, ఆగస్టు 5: నాందేవ్ కాంబ్లే ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే జోగు రా మ న్న అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో నాందేవ్ కాంబ్లే స తాప సభ గురువారం నిర్వహించారు. ముందుగా నాం దేవ్ చిత్రపటానికి ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఇతర నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. నాందేవ్ కాంబ్లే కుటుం బ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవం తుడిని వేడుకుంటున్నానన్నారు. నాందేవ్ దళిత సమాజంపై ఎంతో ప్రేమను చూపారని గుర్తు చే శారు. నాందేవ్ మృతి ఉమ్మడి జిల్లాకు తీరని లో టని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలోనే దళిత బిడ్డ డీ సీసీబీ చైర్మన్గా నాందేవ్ మొదటి వ్యక్తి కా వ డం గుర్తుండిపోతుందన్నారు. ఈ నెల 7న నాందేవ్ సంతాప సభకు పార్టీ కార్యకర్తలు, జిల్లా, నియోజకవర్గ ప్రజలు హాజరవ్వాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ మాట్లాడుతూ.. నాందేవ్ కాంబ్లే ఎన్నో పదవులు పొంది నా, ఎన్నడూ అహంకారంతో మాట్లాడిన సందర్భాలు లేవన్నారు. ఏ సమావేశాలకు వెళ్లినా ప్రజ ల కోసం, దళితుల కోసం చర్చించేవాడని గుర్తుచేశారు. అనంతరం పలువురు నాయకులు, డీసీసీ బీ డైరెక్టర్లు, కాంబ్లేతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లా ద్, రైతు బంధు సమితి అధ్యక్షుడు అడ్డి భోజా రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్లు బాలూరి గోవర్ధన్ రెడ్డి, పరమేశ్వర్, యూనిస్ అక్భానీ, సాజీదుద్దీన్, నల్ల రాజేశ్వర్, కౌన్సిలర్లు సతీశ్, భరత్, పవన్ ఉన్నారు.