ఆదిలాబాద్ జిల్లాలో 5.72 లక్షల ఎకరాల్లో పంటలు
గతేడాది కంటే 4 వేల ఎకరాలు అధికం
అత్యధికంగా పత్తి.. రెండోస్థానంలో కంది..
రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు
ఆదిలాబాద్, మే 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యాసంగి పంట చేతికొస్తున్నది. సర్కారు ప్రతి ఊరికీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా.. కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా.. మరోవైపు వానకాలం పంటల వైపు అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈ యేడాది 5.72లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా కాగా, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నది. గతేడాది కంటే 4 వేల ఎకరాల్లో పంటలు అధికంగా సాగవుతాయని భావిస్తున్నారు. ఈసారి పత్తి ఎక్కువగా సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. 94 వేల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు.
ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి వానకాలం సాగు ప్రణాళికను అధికారులు తయారు చేశారు. ఈ యేడాది 5.72 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేశారు. పత్తి 4.34 లక్షల ఎకరాలు, కంది 80 వేలు, సోయాబిన్ 50 వేలు, 8 వేల ఎకరాల్లో జొన్న, పెసర, మినుము, మక్క, ఇతర పంటలు సాగు చేయవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏడాది సోయాకు బదులు పత్తి వేసే అవకాశాలు న్నాయని తెలిపారు. రైతులకు వానకాలం సాగుపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. జిల్లావ్యాప్తంగా 2017 సంవత్సరం వానకాలంలో 4.63 లక్షల ఎకరాలు, 2018లో 5.05 లక్షలు, 2019లో 5.18 లక్షలు, 2020లో 5.68 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. ఈ యేడాది గతం కంటే 4వేల ఎకరాల్లో పంటలు అధికంగా సాగవుతా యని అధికారులు తెలిపారు. గతేడాది పత్తి 4.08 లక్షల ఎకరాల్లో సాగు కాగా.. పంట దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉండడంతోపాటు క్వింటాలుకు రూ.5,825 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీంతో ఈ యేడాది కూడా పత్తి అధికంగా సాగు కావచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
94 వేల టన్నులు
ఈ యేడాది వానకాలం పంటలకు 94 వేల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. యూరియా 34 వేల టన్నులు, డీఏపీ 13 వేలు, ఎంవోపీ 7 వేలు, కాంప్లెక్స్ ఎరువులు 36 వేలు, ఎస్ఎస్పీ 4 వేల టన్నుల వినియోగం జరుగుతుందని ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు నెలలవారీగా ఎరువుల విక్రయాలు జరుగుతాయన్నారు. ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చు..
ఎరువుల వాడకం తగ్గిం చు కునే విధంగా రైతుల కు అవగాహన కల్పిస్తున్నాం. సాగులో భాగంగా భూము ల్లో ఫాస్పరస్ పోషకాల మందుల వాడకం తగ్గిం చాలి. బ్యాక్టీరియాకు సంబం ధించి పీఎస్పీని వాడుకుంటే భూమిలో ఉన్న ఫాస్పరస్ వినియో గాన్ని పెంచుతుంది. ఫాస్పరస్ అనే బ్యాక్టీరియా ఉపయోగించి డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను తగ్గిం చుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో భూముల్లో నిక్షి ప్తమైన ఫాస్పరస్ ఉపయోగంలోకి వస్తుంది. దీనిపైన రైతు వేదికల్లో అవగాహన కల్పిస్తున్నాం. 101 వ్యవసాయ క్లస్టర్లలో పీఎస్పీ ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.