మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
లక్ష్మణచాంద మండలంలో పర్యటన
లక్ష్మణచాంద, ఆగస్టు 4: బాధితులకు ప్రభు త్వం ద్వారా ఆర్థికసాయం చేస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని కనకాపూర్, లక్ష్మణచాంద గ్రామాల్లో పర్యటించా రు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. కనకాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఆయ న కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి ఓదార్చారు. లక్ష్మణచాంద గ్రామంలో షార్ట్ స ర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించి ఇండ్లు కాలిపోగా, బాధితులైన గుర్రం పోసులు, గుర్రం రవి కటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. పూర్తిగా కాలిపోయిన ఇంటికి రూ.95 వేలు, పాక్షికంగా కాలిపోయిన ఇంటికి రూ.35 వేల చొప్పున ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తామ ని తెలిపారు. ప్రభుత్వం ద్వారా బా ధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇప్పిస్తామన్నారు. డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ రఘునందన్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎంపీపీ కేశం లక్ష్మి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, ఎంపీటీసీ అడ్వాల పద్మ, టీఆర్ఎస్మండల ఇన్చార్జి సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, నాయకులు కేశం రమేశ్, అడ్వాల రమేశ్, జహీరొద్దీన్, ఈటెల శ్రీనివాస్, గుజ్జారి గణేశ్, అర్జున్రెడ్డి పాల్గొన్నారు.