జడ్పీ వైస్చైర్మన్ కోనేరు కృష్ణారావు
అందవెల్లి గ్రామంలో సారీల పంపిణీ
కాగజ్నగర్ రూరల్, అక్టోబర్ 3: అన్ని వర్గాల పండుగలకూ సర్కారు ప్రాధాన్యత ఇస్తున్నదని జడ్పీవైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు. మండలంలోని అందవెల్లి గ్రామంలో ఆదివారం బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మ న్ కాసం శ్రీనివాస్, కోఆప్షన్ సిద్దీఖీ, ఎంపీటీసీ శ్యాంరావు, సర్పంచ్ గంగన్న, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.
దహెగాం మండలంలో..
దహెగాం, అక్టోబర్ 3: మండలంలోని ఇట్యాల, కోత్మీర్, బీబ్రా, ఐనం, దహెగాం గ్రామాల్లో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామారావుతో కలిసి బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కంభగౌని సులోచన, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సిద్ధిఖీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రసాద్రాజు, తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో రాజేశ్వర్గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంభగౌని సంతోష్గౌడ్, ఎంపీటీసీ రాపర్తి జయలక్ష్మి, సర్పంచ్లు వశాక మురారి, తరున్నం సుల్తానా, బండ కృష్ణ, వెల్ముల జయేందర్, పుప్పాల లక్ష్మి, మండల కోఆప్షన్ సభ్యుడు హైమద్, ఏపీఎం చంద్రశేఖర్, నాయకులు గజ్జల శ్రీనివాస్, సోను, సంగర్సు బాలకిషన్రావు, ఆయ గ్రామాల కార్యదర్శులు, ఐకేపీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తా: ఎమ్మెల్యే కోనప్ప
సిర్పూర్(టీ), అక్టోబర్ 3 : మండలకేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించే బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే కోనప్ప అన్నారు. మండలకేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ కల్యాణ మండపంలో ఆదివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బస్టాండ్ ప్రాంతంలో ఆర్అండ్బీ రోడ్డుకిరువైపులా డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే నిధులు రూ 10 లక్షలు కేటాయిస్తానన్నారు. అదేవిధంగా పేట్ మహేళా నుంచి డౌనల్ ప్రాంతం వరకు రోడ్డు పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం చీరెలు పంపిణీ చేశారు. పంచాయ తీ నిధులు రూ 2 లక్షలతో చేపడుతున్న లక్ష్మీ నారాయణ కల్యా ణ మండపం ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చునార్కర్ సువర్ణ, సర్పంచ్ తఫీమా పర్వీన్, మండల వైస్ ఎంపీపీ ఈర్త సత్యనారాయణ, ఎంపీటీసీలు సు హైల్ అహ్మద్, తుకారాం, కారం శైలజ, ఉప సర్పంచ్ తోట మ హేశ్, మండల కో ఆప్షన్ సభ్యుడు కీజర్హుస్సేన్, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ నీరటి సత్యనారాయణ, ఐకేపీ ఏపీఎం దుర్గయ్య, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.