ఏపీ నుంచి దిగుమతి
పల్లెలకు సరఫరా..
రైతులకు అంటగడుతున్న వ్యాపారులు
ఇటీవల రూ. 11.36 లక్షల విలువైన 8 క్వింటాళ్లు పట్టివేత
అప్రమత్తంగా లేకుంటే అంతే..
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ):మరో నెల రోజుల్లో వానకాలం సాగు ప్రారంభం కానుండగా, అప్పుడే నకిలీ విత్తనాల దందా మొదలైంది. ఏపీ నుంచి దిగుమతి చేస్తున్న దళారులు, పల్లెలకు సరఫరా చేసి అమాయక రైతులకు అమ్మేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 9న సిర్పూర్(టీ)లో రూ.11.36 లక్షల విలువైన 8 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడడం ఇందుకు బలం చేకూరుస్తున్నది. సీజన్కు ముందే పల్లెల్లోకి వాటిని సరఫరా చేస్తున్నట్లు అర్థమవుతుండగా, అధికారులు నిఘా పెట్టాల్సిన అవసరముంది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో నకిలీ విత్తనాలు పట్టుబడడం యేటా సర్వసాధారణమైంది. ప్రతిసారి వర్షాకాలం ప్రారంభమైన తర్వాత రైతులు విత్తనాలు వేసే సమయంలో దళారులు నకిలీ విత్తనాలను పల్లెల్లోకి సరఫరా చేసేవారు. కానీ ఈ ఏడాది సీజన్కంటే ముందే గ్రామాల్లోకి చేర్చి రైతులకు అంటగట్టేందు కు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలోని సిర్పూర్-టి, కౌటాల, బెజ్జూర్, దహెగాం, పెంచికల్పేట్, మండలాల్లో రైతులు అధికంగా పత్తి సాగు చేస్తారు. యేటా సీజన్లో పత్తి విత్తనాల కొరత ఉంటుందని ఈ ప్రాం త రైతులు ముందస్తుగానే విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు ఈ దందాకు పాల్పడుతుంటారు. కొంతమంది బ్రోకర్లు ఈ ప్రాంత రైతులను మచ్చిక చేసుకొని ముందస్తుగానే వాటిని అంటగడుతారన్న ఆరోపణలున్నాయి. ఈ విత్తనాలు వాడితే దిగుబడి బాగా వస్తుందని, కలుపు ఉండదని, గులాబీ రంగు పురుగుల దాడి ఉండదని నమ్మించి అంటగడుతారని, తీరా అవి కొనుగోలు చేసి నాటి న తర్వాత అసలు మొలకలే రావని గతంలో కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి.
ఏపీ నుంచి దిగుమతి..
యేటా ఆంధ్రపదేశ్లోని వివిధ కంపెనీల నుంచి విత్తనాల ను తీసుకువచ్చి బ్రాండెడ్ కంపెనీల పేరిట విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9న సిర్పూర్(టీ)లో రూ. 11.36 లక్షల విలువైన 8 క్వింటాళ్ల (1600 ప్యాకెట్లు-ఒక్కో ప్యా కెట్లో 450 గ్రాములు) నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడడం ఇందుకు బలం చేకూరుతుంది. అక్కడి కంపెనీల వద్ద ఒక్కో ప్యాకెట్కు రూ. 300 నుంచి రూ. 350 వెచ్చించి తీసుకువ చ్చి, ఇక్కడ ఒక్కో ప్యాకెట్ను రూ. 750 నుంచి రూ. 800 వరకు విక్రయిస్తారని సమాచారం. పోలీసులు, వ్యవసాయ, టాస్క్ఫోర్స్ అధికారులు నకిలీ విత్తనాలు సరఫరాపై కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.