నిర్మల్ అర్బన్, ఆగస్టు 2 : పరిసరాల శుభ్రతతోనే వ్యాధులకు చెక్ పెట్టవచ్చని, సీజనల్ వ్యాదులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యుడు నాగేశ్వర్రావు సూచించారు. సోమవారం పట్టణంలోని రాంనగర్ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక శాంతినగర్లో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. దాదాపు 70 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, ఇండ్లల్లో, పరిసరాల్లో టైర్లు, కొబ్బరి చిప్పలు, పగిలిన సీసాలు వాడిన టీకప్పులు ఇతర నీటి నిల్వ గల చిన్న పాత్రలను తొలగించాలని తెలిపారు. కౌన్సిలర్ సంపంగి రవి, కమ్యూనిటీ ఆర్గనైజర్ రమణ, స్రవంతి, ఏఎన్ఎం, ఆశలు సంధ్య, కళావతి తదితరులున్నారు.
ఇంటింటా సర్వే
మండలకేంద్రంలో విషజ్వరాలు ప్రబలుతుండడంతో సోమవారం ఇంటింటా సర్వే చేపట్టారు. స్థానిక ఆరోగ్య కేం ద్రం వైద్యుడు శ్యామ్కుమార్ ఆధ్వర్యంలో వైద్య బృందం సభ్యులు ఇంటింటా తిరిగి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. అవసరమైన వారికి ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసి మందులు అం దించారు. ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారం లేకుం డా, మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలని కోరారు. స్థానిక సర్పంచ్ వీరేశ్కుమార్, వైద్య బృందం వేణురావు, జగన్మోహన్, ఏఎన్ఎంలు సునీత, పుష్ప, ఆశ కార్యకర్తలు విజయ, సత్తక్క, విజయలక్ష్మి, గంగామణి తదితరులున్నారు.