శ్రీరాంపూర్, జూలై 29 : సీఎం కేసీఆర్ చొరవతో అనేక హక్కులు సాధించామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ పేర్కొన్నారు. కార్మికుల విరమణ వయస్సు 61 ఏండ్లకు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ 1గనిపై గురువారం టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ఉపాధ్యక్షుడు డీకొండ అన్నయ్య, మంద మల్లారెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధులు ఏనగురు రవీందర్రెడ్డి, కే వీరభద్రయ్య, నస్పూర్ మున్సిపల్ చైర్మెన్ ఇసంపెల్లి ప్రభాకర్, కార్మికులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ కార్మిక సంఘాలు వారసత్వ ఉద్యోగాలూ పోగొడితే టీబీజీకేఎస్ సాధించిందిదన్నారు. కారుణ్య నియామకాల ద్వారా సంస్థలో 13 వేల యువత ఉద్యోగాల్లో చేరారన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి చాట్ల అశోక్, ఏరియా కార్యదర్శి పానగంటి సత్తయ్య, కానగంటి చంద్రయ్య, మాజీ సర్పంచ్లు గుంట జగ్గయ్య, జక్కుల రాజేశం ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, పిట్ కార్యదర్శులు ఎంబడి తిరుపతి, మహేందర్, సత్యనారాయణ, గోపాల్రెడ్డి, పెంట శ్రీనివాస్, రాయమల్లు, నాయకులు జగన్, చిలువేరు సదానందం, మహిపాల్రెడ్డి, భాస్కర్, ఎర్రయ్య, కుర్సు దుర్గయ్య పాల్గొన్నారు.