బాసర, జూలై 28 : బాసర శ్రీ సరస్వతీ అమ్మవారిని ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఈయన వెంట పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు, రమణారావు తదితరులు ఉన్నారు. అలాగే అమ్మవారిని ఎస్బీఐ అధికారులు దర్శించుకున్నారు. హైదరాబాద్ ఎస్బీఐ సర్కిల్ సీజీఎం అమిత్ జింగరణ్, ఎన్డబ్ల్యూ-1 జీఎం జోగేశ్ చంద్రసాహూ, నిజామాబాద్ ఏవో డీజీఎం ప్రఫుల్లాకుమార్, ఏజీఎం ఆర్బీవో ఏడీబీ సూర్యప్రకాశ్రావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి వెంట బాసర ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ కే రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ కీలక పాత్ర పోషిస్తున్నదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పీఆర్టీయూ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూర రఘోత్తం రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. చరిత్రలో లేని విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ఫిట్మెంట్ సాధించడంలో సంఘం కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు, జిల్లా అధ్యక్షుడు బీవీ రమణా రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్రబాబు, రాష్ట్ర అసోసియేట్ సయ్యద్ అన్సర్, మల్లన్న, శ్రీనివాస్, ఎంఈవోలు సుభాష్, చంద్రకాంత్, భైంసా మండలాధ్యక్షుడు గజ్జారాం, ప్రధాన కార్యదర్శి గోపాల్, పీఆర్టీయూ నాయకులు తదితరులు ఉన్నారు.
ముథోల్ పాఠశాలను ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి సందర్శించారు. పాఠశాల సమస్యలపై ఉద్యోగులతో కలిసి చర్చించారు. రాబోయే కాలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్సీని ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించారు. ఆయన వెంట ఎంఈవో మైసాజీ, పీఆర్టీయూ మండల బాధ్యులు మల్లారెడ్డి, ప్రవీణ్రెడ్డితో పాటు వివిధ మండలాల నుంచి రాష్ట్ర, మండల బాధ్యులు, ఉపాధ్యాయులు ఉన్నారు.