కుంటాల, సెప్టెంబర్, 28 : జిల్లాలో మూడు గ్రామాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయిం ది. కుంటాల మండలం కొత్త వెంకూర్ గ్రామంలో వందశాతం వ్యాక్సిన్ వేసుకొని గ్రామస్తులు ఆద ర్శంగా నిలిచారు. మొదటి, రెండో రోజు వంద శాతం పూర్తి కావడంతో మంగళవారం గ్రామాన్ని అధికారులు సందర్శించారు. ప్రతి ఇంటికి వ్యాక్సి న్ వేసుకున్నట్లు స్టిక్కర్లను అతికించారు. గ్రామం లో పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేసుకొని ఆదర్శంగా నిలిచిన ప్రజలను ఎంపీడీవో మోహన్ రెడ్డి అభి నందించారు. సర్పంచ్ మగ్గిడి శృతి, నాయకు లు దిగంబర్ను అధికారులు అభినందించారు. దౌనె ల్లి పంచాయతీ అనుబంధ గ్రామమైన గమ్మ పూర్లో పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గిరిజన గ్రామమైన గమ్మ పూర్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి కావడంపై సర్పంచ్ ఎండీ హైమద్, గ్రామస్తులను అభినం దించారు. గమ్మపూర్ కొత్త వెంకూర్ గ్రామాలను మండల వాసులు స్ఫూర్తిగా తీసుకోవాలని ఎంపీవో కవిరాజ్ సూచించారు.
మున్యాల తండాలో..
మండలంలోని మున్యాల తండా గ్రామ పంచాయతీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు హెచ్ఈవో వేణు గోపాల్ తెలిపారు.గ్రామంలో మొత్తం 345 మంది ఉండగా సర్పంచ్ నాగవత్ సురేశ్ నాయక్ సహకారంతో అందరికీ టీకా వేసినట్లు పేర్కొ న్నారు. గొడిసేర్యాల గ్రామ పంచాయతీలో వైద్య సిబ్బంది కొవిడ్ వ్యాక్సిన్ క్యాంపును నిర్వహించి, ప్రజలకు టీకాలను వేశారు. ఉప సర్పంచ్ మాణిక్ రావు, పంచాయతీ కార్యదర్శి సౌమ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముడికే ఐలయ్య యాదవ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కిష్టాపూర్లో..
కిష్టాపూర్ గ్రామం లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 100 శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. గ్రామా న్ని ఎంపీడీవో దేవేందర్రెడ్డి సందర్శించి ఆరోగ్య శాఖ సిబ్బంది స్థానిక పంచాయతీ కార్యద ర్శిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన వారు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ శైలజ నరేందర్ రెడ్డి, గ్రామస్తులను ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, ఎంపీవో రమేశ్ అభినందించారు.