మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 24 : మంచిర్యాల బస్టాండ్ ఎదురుగా రామ రాజేశ్వరి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ను సినీ నటి కీర్తి సురేశ్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాల్ ముం దున్న స్టేజీపై నుంచి అభిమానులకు అభివాదం చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎంఆర్ 11వ షోరూం ప్రారంభానికి రావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం కీర్తి సురేశ్ షోరూంలో తిరుగుతూ పట్టు చీరెలను పరిశీలించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ ప్రొప్రైటర్ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ పిల్లల నుంచి పెద్దల వరకు ఆకర్షణీయమైన కొత్త డిజైన్లు, వివిధ రకాల దుస్తులు మిగతా షోరూంల కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భీమ్లా నాయక్ సినిమా టైటిల్ పాటతో ఫేమస్ అయిన కిన్నెర వాయిద్యకారుడు మొగిలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన కిన్నెర వాయిద్యంతో భీమ్లా నాయక్ పాట పాడి అందరినీ అలరించాడు. తీన్మార్ ఫేమ్ సావిత్రి (శివజ్యోతి) కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కీర్తి సురేశ్ అభిమానులు, పట్టణ ప్రజలతో షాపింగ్ మాల్ ప్రాంతమంతా సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేశ్ గౌడ్, రాజేశ్ గౌడ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.