ఆదిలాబాద్, ఏప్రిల్ 6 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా విస్తరిస్తుంది. సగటు న రోజుకు 70 వరకు పాజిటివ్ కేసులు నమోదవున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ నియంత్రణలో భాగంగా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 30 కేంద్రాల్లో రోజుకు 1800 నిర్ధారణ టెస్ట్లు చేస్తున్నారు. అ లాగే 29 కేంద్రాల్లో ఇప్పటి వరకు 21,613 మందికి వైద్యశాఖ అధికారులు వ్యాక్సిన్ వేశారు. వైద్యశాఖ, పోలీసుల ఆ ధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారికి టీకాను వేస్తుండగా, అర్హులైన వారందరూ తీసుకునేలా అధికారులు చర్య లు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ రిమ్స్, ఉట్నూర్ క మ్యూనిటీ సర్కారు దవాఖానల్లో ఐసోలేషన్ వార్డులు ఏ ర్పాటు చేసి వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు ఏ ర్పాట్లు చేశారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారికి ఉచితంగా కరోనా కిట్స్ను పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లోనూ రోజుకు 20 నుంచి 30 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
ప్రైవేట్ దవాఖానలపై నజర్..
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అధికారులు ప్రైవేట్ దవాఖానలపై దృష్టి సారించారు. ప్రజలు కరోనా టెస్ట్లు, వైద్యం కోసం ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించే అవకాశం ఉండడంతో వైద్యాధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ సమీపంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు మాత్రమే చికిత్స చేసే అనుమతి ఉంది. అనుమతి లేని వాటిల్లో టెస్ట్లు నిర్వహించకుండా, కొవిడ్కు వైద్యం చేయకుండా ముగ్గురు వైద్యాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ బృందం దవాఖానల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంది. నిర్వాహకులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు వైద్యసేవలు అందించడంతో పాటు కొవిడ్ టెస్ట్లు, వైద్యం అందించడం లాంటి విషయాలను పరిశీలిస్తారు. అక్రమాలు వెలుగుచూస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. జిల్లా కేంద్రంలో కరోనా తగ్గేందుకు ఇచ్చే రెమిడిసివిర్ ఇంజిక్షన్ను విక్రయిస్తున్నట్లు వైద్యాధికారుల దృష్టికి రావడంతో మెడికల్ షాపుల్లోనూ తనిఖీలు చేపట్టనున్నారు.
సర్కారు దవాఖానల్లో అన్ని సేవలు
కరోనా నియంత్రణలో భాగంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని 30 సర్కారు దవాఖానల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు మొబైల్ వాహనాల ద్వారా రోజుకు 1800 టెస్ట్లు చేస్తున్నాం. 29 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది. సర్కారు అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలి. ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు మాత్రమే కొవిడ్కు వైద్యం అందించే అనుమతి ఉంది. ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి. అనుమతులు లేని దవాఖానల్లో టెస్ట్లు చేసినా, వైద్యం అందించినా కఠిన చర్యలు తీసుకుంటాం.