కోటపల్లి, జూన్ 23 : మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర సరిహద్దు కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో నిఘా పెంచారు. ప్రాణహిత పరీవాహక ప్రాంతాల్లో బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ప్రాణహిత ఆవల గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతుండడంతో ఇక్కడికి ప్రవేశించే అవకాశం ఉండడంతో గాలింపులు ము మ్మరం చేశారు. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తారన్న అంచనాతో పోలీసులు అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. గురువారం ప్రాణహిత వం తెన వద్ద రామగుండం ఓఎస్డీ శరత్ చంద్రపవార్ , డీసీపీ ఉద య్ కుమార్ రెడ్డి, మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్, జైపూర్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అర్జునగుట్ట వద్ద పోలీసులు కూంబింగ్ ను పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులను ఆదేశించారు. చెన్నూరు రూరల్ సీఐ నాగరాజు, టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్, కోటపల్లి ఎస్ఐ రవి కుమార్, నీల్వాయి ఎస్ఐ రహీం పాషా, ట్రైనీ ఎస్ఐ శ్రీకర్ పాల్గొన్నారు.
డ్రోన్ కెమెరాలతో నదిపై నిఘా.
ప్రాణహిత పరీవాహక ప్రాంతాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా పె ట్టారు. అర్జునగుట్ట వంతెన వద్ద డ్రోన్లతో చిత్రీకరించారు. నాటు పడవల ద్వారా మావోయిస్టులు జిల్లాలో ప్రవేశించే అవకాశం ఉందన్న అనుమానంతో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
రాపన్పల్లిలో కార్డన్ సెర్చ్
మండలంలోని రాపన్పల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానిత ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా ఓఏస్డీ శరత్ చంద్రపవార్ మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులకు సహకరించవద్దని, అనుమానితులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
అప్రమత్తంగా ఉన్నాం : ఓఎస్డీ శరత్ చంద్ర
జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేకపోయినా అప్రమత్తంగా ఉంటున్నామని ఓఎస్డీ శరత్ చంద్రపవార్ అన్నారు. మహారాష్ట్ర కు వెళ్లే దారుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. ప్రాణహిత తీర మావోయిస్టు ప్రభావిత గ్రామాలపై నిరంతరం నిఘా పెట్టామని తెలిపారు. మహారాష్ట్ర, చత్తీస్ఘడ్లో మావోల కదలికల నే పథ్యంలో సరిహద్దులను ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.