ఎదులాపురం,అక్టోబర్19 : విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. పోలీస్ అమరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన వచ్చినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మంగళవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఇన్చార్జి ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ఆపద సమయాల్లో బాధితులకు రక్తదానం చేయడం దేశ సేవతో సమానమన్నా రు. ప్రజల భద్రత, రక్షణలో జిల్లా పోలీసులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని గుర్తు చే సుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి యువకులు, వివిధ సొసైటీల సభ్యులు, పోలీసులు స్పందించి రక్తదానం చేశారని తెలిపారు. రిమ్స్ వైద్యశాలలో 250 యూనిట్ల రక్తం నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. పారు. జిల్లాకు చెందిన విమాన మహిళా పైలెట్ గంట స్వాతి రక్తదానం చేశారు. అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీలు వెం కటేశ్వర్ రావు, విజయ్కుమార్, రిజర్వ్ సీఐ గడిగొప్పల వేణు, సుధాకర్రావు, బీ శ్రీపాల్, జైనథ్ సిఐ కొంక మల్లేష్, ఎస్ఐలు సాయిరెడ్డి వెంకన్న, పోలీస్ యూనిట్ డాక్టర్ సీ ఆర్ గంగారాం, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్, వైస్ చైర్మన్లు ఎస్ గంగేశ్వర్, బాలశంకర్ కృష్ణ, చీఫ్ అడ్వైజర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, సభ్యులు కే వేణుగోపాల్ రెడ్డి, ఎం గంగాధర్, కాళిదాస్, ఎన్ సత్యనారాయణ, పసుపుల రాజు, కుంట కిరణ్ రెడ్డి పాల్గొన్నారు.