భీంపూర్, మే 2: కరంజి(టి), పిప్పల్కోటి, కామట్వాడ గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. పంచాయతీ పాలక వర్గం సూచించిన సమయాల్లోనే కిరాణ దుకాణాలు గంటపాటు తెరుస్తున్నారు. గ్రామస్తులు అత్యవసరమైతేనే బయటకు వస్తున్నారు. కామట్వాడ పంచాయతీ పరిధి గోవింద్పూర్ – మహారాష్ట్ర జమునా నగర్ నడుమ మహారాష్ట్ర వారు రాకుం డా తాత్కాలిక చెక్పోస్టు ఏర్పాటు చేస్తున్నారు. సర్పంచ్ లు గుర్ల స్వాతిక, తాటిపెల్లి లావణ్య, కేమ కల్యాణి స్వచ్ఛంద లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
నేరడిగొండలో..
నేరడిగొండ, మే 2 : మండల కేంద్రంలో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. ఆదివారం వాణిజ్య, వ్యాపార సంస్థలు మూసి ఉంచడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు మూతపడ్డాయి. మండలంలోని అన్ని గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. కరోనా సెకండ్వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కు పెట్టుకోవడ ంతో పాటు భౌతికదూరం పాటించాలన్న అధికారుల సూచన మేరకు ప్రజలు నడుచుకుంటున్నారు.
ప్రతి గ్రామంలో లాక్డౌన్ అమలు చేయాలి
నార్నూర్, మే 2 : కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రతి గ్రామంలో లాక్డౌన్ అమలు చేసుకోవాలని కుమ్రంభీం యూత్ అధ్యక్షుడు సిడాం అంభురావ్ పేర్కొన్నారు. ఆదివారం గాదిగూడ మండలం లోకారి(కే)గ్రామంలో వారసంతతోపాటు, మార్కెట్ను బంద్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా ఉధృతిని అరికట్టే ందుకు స్వీయ నియంత్రణే ఉత్తమ మార్గమన్నారు. ఈయన వెంట ఆదివాసీ నాయకులు వెడ్మా జ్యోతిరామ్, ఆత్రం సంతోశ్, యూత్ సభ్యులు ఉన్నారు.