ఉట్నూర్, అక్టోబర్ 19 : ఆదివాసీ పండుగలు, ఆలయాలకు నిధులిచ్చిన మొదటి సీఎం కేసీఆర్నే అని ఎంపీపీ పంద్ర జైవంత్రావు పేర్కొన్నారు. స్థానిక ప్రెస్భవన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీపావళి పండుగకు గుస్సాడీలకు పది వేల చొప్పున ఇచ్చేం దుకు నిధులు విడుదల చేయడం సంతోషకర మన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేస్లాపూర్ ఆల యం, జంగుబాయి ఆలయం, పద్మల్పురి కాకో, జోడేఘాట్ లాంటి పవిత్ర స్థలాలకు నిధులిచ్చి అభివృద్ది చేశారన్నారు. ఏజెన్సీ సమస్యలు కేసీఆ ర్కు తెలుసని వాటిని పరిష్కరించేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నారన్నారు. నిధుల విడుదలకు సహకరించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, మాజీ ఎంపీ గోడాం నగేశ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివాసు లు కేసీఆర్కు రుణపడి ఉంటారన్నారు. ఈ సమా వేశంలో నైతం చిత్రు, బాదిరావు, మాణిక్ రావు, కొద్దు, శంకర్, భరత్ పాల్గొన్నారు.
ఆదివాసీల హర్షం
ఆదివాసీలు అత్యంత వైభవంగా నిర్వహించనున్న దండారీ ఉత్సవాలకు ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేయడం పై ఆదివాసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గాదిగూడ మండలం లోకారి(కే)గ్రామంలో వారు విలేకరులతో మాట్లాడారు. దండారీ పండుగను గుర్తించి నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్, మంత్రి అల్లోల ఇంద్రకర ణ్రెడ్డి, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ ఎమ్మె ల్యే ఆత్రం సక్కుకు రుణపడి ఉంటామని తెలిపా రు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పూసం బాదిరా వ్, సర్పంచ్లు మెస్రం దేవ్రావ్,ఆడా రాహుల్, సిడాం ఆనంద్రావ్, మడావి కానూ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం జగ్గే రావ్, కమిటీ డైరెక్టర్ మండాడి దౌవ్లత్రావ్, సోయం మారుతి, పెందోర్ పాక్రు, ఆత్రం చందు తదితరులున్నారు.
బోథ్లో..
దండారీ ఉత్సవాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై ఐటీడీఏ పాలకవర్గ మాజీ డైరెక్టర్ మేస్రం భూమ న్న హర్షం వ్యక్తం చేశారు. సొనాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదివాసీలతో కలిసి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలోని ప్రతి గూడేనికి రూ. 10 వేల చొప్పున కేటాయిస్తామని ప్రకటించడం అభినం దనీయమన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామా ల పటేల్లు, నాయకులు పాల్గొన్నారు.