తాంసి, ఆగస్టు 3: నాందేవ్ కాంబ్లే మరణం ఉమ్మడి జిల్లాకు తీరని లోటని, దళితుల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాలులో డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే సంతాప సభను జిల్లా సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాపరిషత్ చైర్మ న్ జనార్దన్ రాథోడ్, ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, నాయకుల తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పా టించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏజె న్సీ ప్రాంతంలోని దళితుల కోసం బ్యాంకు రుణాలు, వ్యవసాయ పనులు, ఇతర సహకారం అందించేవారని అ న్నారు. కాంట్రాక్టర్గా విద్యుత్శాఖలో పనులు చేపట్టడంతో పాటు, సహకార సంఘాల్లో ప్రాతినిథ్యం వహి స్తూ చైర్మన్గా, బ్యాంకు డైరెక్టర్గా, వైస్చైర్మన్గా ప నిచేసి మంచి గుర్తింపు పొందారని గుర్తు చేశారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లాకు డీసీసీబీ చైర్మన్ గా నియమించారని పేర్కొన్నారు. తన సొంతూరు గుం జాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారని, తన చిరకాల వాంఛను నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా నిలుస్తామని పేర్కొన్నారు. జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ మాట్లాడుతూ నాందేవ్ కాంబ్లే బహుజన బాంధవుడ ని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, డీసీసీబీ ఇన్చార్జి చైర్మన్ రఘునందన్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, డీసీసీబీ సీఈవో శ్రీధర్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రేమేందర్, డీసీసీబీ డైరెక్టర్లు గోవర్ధన్రెడ్డి, దుర్గం రాజేశ్వర్, డీసీసీబీ ఉద్యోగులు, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యంతో ముందుకు సాగాలి
యువత నిర్దేశించుకున్న ల క్ష్యాలను చేరేందుకు ధైర్యంగా అడుగులు వేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణానికి చెందిన గుండా సాయివినయ్ జూన్ 22న కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 39 రోజుల బైక్ యాత్ర పూర్తి చేసుకొని నిర్మల్కు చేరుకున్నాడు. దీంతో మంత్రి అయనను మంగళవారం అభినందించి, శాలువాతో ఘ నంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మ న్ ఈశ్వర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, గుం డా గణేశ్, వెంకటేశ్, సురేశ్, సుభాష్, మహాదేవ్, మణికంఠ తదితరులున్నారు.