ఆదిలాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి క్రమంగా పడుతున్న వానలతో ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భజల నీటిమట్టం కూ డా గణనీయంగా పెరిగింది. సీజన్ ప్రారంభానికి ముందు జి ల్లాలో భూగర్భజలాలు 14 మీటర్లు లోతులో ఉండగా, ప్ర స్తుతం సగటు నీటిమట్టం 3.7 మీటర్లకు చేరింది. గతేడాది జూ లైలో జిల్లాలో సగటు నీటిమట్టం 6.73 మీటర్ల లోతులో ఉండ గా ఈ ఏడాది జూలైలో 3.7మీటర్ల లోతులో ఉంది. గతేడాది ఆగస్టులో 3.77 మీటర్ల లోతులో ఉండగా, ఈ ఏడాది అదే నెలలో 3.05 మీటర్ల లోతులో ఉంది. గతేడాది కంటే ఈ ఏడాది జూలైలో సగటు భూగర్భజలాలు 3.7 మీటర్లు, ఆగస్టులో 0.72 మీటర్ల మేర పెరిగాయి. జిల్లాలో భూగర్భజలాల హెచ్చుతగ్గులు తెలుసుకునేందుకు సంబంధిత శాఖ అధికారు లు 10 సాధారణ పరిశీలక బావులు, 15 ఫీజో మీటరు బావులను ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఈ ఏడాది వానకాలంలో శుక్రవారం వరకు జిల్లాలో 979.1 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 1456.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఫలితంగా భూగర్భజలాలు బాగా పైకి వచ్చాయి.
రెండేళ్లతో పోల్చితే..
జిల్లాలో గత రెండేళ్లతో పోలిస్తే నీటిమట్టాలు బాగా పెరిగాయి. 2019 జూలైలో జిల్లాలో సగటు భూగర్భజలాలు 9.03 మీటర్ల లోతుకు ఉండగా, 2020లో 6.73 మీటర్లు, ఈ ఏడా ది జూలైలో 3.77 మీటర్లకు చేరాయి. 2019 ఆగస్టులో సగటు భూగర్భ నీటిమట్టం 4.11 మీటర్ల లోతులో ఉండగా, 2020 ఆగస్టులో 3.77 మీటర్ల పైకి చేరాయి. ఈ ఏడాది ఆగస్టులో 3.05 మీటర్ల పైకి వచ్చాయి. గతేడాది జూలైతో పోల్చితే ఈ ఏడాది అదేనెలలో 2.96 మీటర్లు, ఆగస్టులో 0.72 మీటర్ల పైకి ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో బోర్లలోని నీళ్లు మోటర్లు వేయకుండానే పైపైకి ఉబికి వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ నెలలో కూడా భారీగా వర్షాలు పడుతుండగా, భూగర్భ జలం మరింత పైకి వచ్చే అవకాశాలున్నాయి.
పెరగనున్న యాసంగి సాగు
ఈ ఏడాది వానకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 5.56 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. క్రమంగా కురుస్తున్న వర్షా లు, వాతావరణ పరిస్థితులు పంటలకు అనుకూలించడంతో పంటలు ఏపుగా పెరుగుతున్నాయి. దిగుబడి కూడా ఆశాజనకంగా ఉండే అవకాశాలున్నాయి. భారీ వర్షాల కారణంగా సా గునీటి వనరుల్లో పుష్కలంగా నీరు చేరింది. సీజన్ ప్రారంభం నుంచి పడుతున్న వర్షాల కారణంగా పంటలకు ప్రాజెక్టులు, చెరువుల ద్వారా నీటి అవసరం పడలేదు. భూగర్భజలాలు పైన ఉండడంతో యాసంగి సాగు విస్తీర్ణం కూడా పెరిగే అవకాశాలున్నాయి. జిల్లాలో 20 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్ష న్లు ఉండగా, రైతులు యాసంగి పంటలకు బావుల్లోని నీటిని వినియోగిస్తారు. గతేడాది 1.25 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా, ఈ ఏడాది మరో 30 వేల ఎకరాల వరకు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.