ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 24 : ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్ తరహాలో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. ఇంద్రవెల్లి ప్రభుత్వ దవాఖానను శుక్రవారం ఆయన డీఎంహెచ్వో నరేందర్తో కలిసి తనిఖీ చేశారు. రోగుల వార్డుతో పాటు ప్రసూతి, రక్త పరీక్షల గదులతో పాటు దవాఖానను పరిశీలించారు. అనంతరం బాలింతలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ వైద్యంపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్నదన్నారు. గ్రామాల ప్రజలు ప్రభుత్వ వై ద్యాన్ని సద్వినియోగం చేసుకొని, ఆరోగ్యం గా ఉండాలని సూచించారు. దవాఖానలో అన్ని సౌకర్యాలతో పాటు వసతులు కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంవో శ్రీధర్, వైద్యుడు శ్రీకాంత్, మాజీ ఎంపీపీ కనక తుకారాం, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, ఎంపీటీసీలు కోవ రాజేశ్వర్, ఆశాబాయి, టీఆర్ఎస్ నాయకులు కనక హనుమంత్రావ్, మర్సుకోల తిరుపతి, సీహెచ్వో రాథోడ్ బాబూలాల్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.