తాండూర్, అక్టోబర్ 26 : ఎన్టీపీసీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు పెట్టిస్తానని రూ. 23 లక్షలు తీసుకుని మోసానికి పాల్పడిన వ్యక్తిని తాం డూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాండూర్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్ వివరాలు వెల్లడించారు. భీమిని మండలం బిట్టూర్పల్లికి చెందిన పోతరాజుల సురేశ్ హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ సురేశ్ ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఉద్యోగలిప్పిస్తానంటూ స్నేహితులు, బంధువులను మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలో తాం డూర్కు చెందిన ఎరవోతు సత్తయ్య వద్ద రూ. 3,50,000 , ఎల్లాకుల సురేశ్ వద్ద రూ. 14,80,000 , దేవాపూర్కు చెందిన భూపతి శివకు మార్ వద్ద రూ. 3,00,000 మొత్తం రూ. 23 లక్షలు తీసుకుని కొందరికి ప్రామిసరీ నోట్ కూడా రాసిచ్చాడు. కొందరు గూగుల్ పే కూడా చేశారు. అపాయింట్ మెంట్ ఆర్డర్ గురించి డబ్బులు ఇచ్చిన బా ధితులు సురేశ్పై ఒత్తిడి చేశారు. రోజులు గడుస్తుండడంతో బాధితులకు అనుమానం వచ్చి ఎరవోతు సత్తయ్య7-09-2021న తాండూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం సురేశ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఇంకా కొంతమంది వద్ద కూడా డబ్బులు తెలిపారు.
భీమిని, దేవాపూర్లో కూడా కేసులు నమోదయ్యాయి. జల్సాలకు డబ్బులు మొత్తం ఖర్చు చేశాడని, అతని నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు. సమావేశంలో సీఐ కోట బాబురావు, ఎస్ఐ కిరణ్కుమార్ ఉన్నారు.