ఎదులాపురం, సెప్టెంబర్ 6 : అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరఫరా చేసిన ఓటరు నమోదు, ఆధార్ అనుసంధానానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఓటు హక్కు ఉన్నవారు ఆధార్ అనుసంధానం చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్ నటరాజ్, ట్రైనీ అదనపు కలెక్టర్ శ్రీజ, ఆర్డీవో రమేశ్ రాథోడ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.