ఖానాపూర్ టౌన్, ఆగస్టు 16 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నిరుపేద కుటుంబాల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నేరుగా లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఎంపీపీ మొయీద్, వైస్ ఎంపీపీ వాల్సింగ్, తహసీల్దార్ రాజమోహన్, అధికారులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, పాల్గొన్నారు.
అర్హులందరికీ ఆసరా పింఛన్లు
అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. మండలంలోని బీర్సాయిపేట్, బాబాపూర్ గ్రామాల్లో 148మందికి నూతన ఆసరా పింఛన్ కార్డులు అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్రావ్,అధికారులు,నాయకులు ఉన్నారు.