ఇంద్రవెల్లి, జూలై29 : మహిళా సమాఖ్యలోని అన్ని గ్రూపులకు తప్పకుండా బ్యాంక్ లింకేజీ చేయాలని డీపీఎం దరావత్ నరేందర్ అన్నారు. మండలంలోని ఐకేపీ కార్యాలయంలో ఎస్హెచ్జీ గ్రూపు సభ్యులతోపాటు సీసీలు, వోవోఏలకు ఐకేపీ పథకాలపై గురువారం అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లారు. మహిళా సంఘాల గ్రూపులకు బ్యాంక్ లింకేజీ చేసి అందులో తప్పకుండా పొదపు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో 631 మహిళా సంఘాలకు రూ. 12.27 కోట్ల బ్యాంక్ లింకేజీ ఉందన్నారు. ఇప్పటి వరకు రూ. 1.20 కోట్లు మాత్రమే బ్యాంక్ లింకేజీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీనిధి ద్వారా మంజూరు చేసే రుణాలను మహిళా సంఘా సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పథకం ద్వారా పశువులు, వాహనాలు, కోళ్లపెంపకం, సూపర్ మార్కెట్ల ఏర్పాటుకు రుణాలు మంజూరు చేయనున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీనిధి పథకాన్ని ఆగష్టు ఒకటో తేదీ నుంచి అన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నదన్నారు. జిల్లాలో 1474 గ్రామ సంఘాలు ఉన్నాయని, అందులో వెయ్యి గ్రూపులకు మాత్రమే రుణాలు మంజూరు చేసే లక్ష్యం ఉందన్నారు. స్త్రీనిధి పథకం ద్వారా అతితక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయనున్నట్లు వివరించారు.కార్యక్రమంలో స్రీనిధి జనరల్ మేనేజర్ రాందాస్, అసిస్టెంట్ మేనేజర్ నీలకంఠేశ్వర్, ఏపీఎం రాథోడ్ రామారావ్, ఐకేపీ సీసీలు పాల్గొన్నారు.