ఖానాపూర్ రూరల్, అక్టోబర్ 19 : గ్రామాల అభివృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్న తే టీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. బాదన కుర్తి గ్రామ పరిధిలో సైడ్ డ్రైనేజీ, చింతల్పేట్లో ఖబ్రస్తాన్ ప్రహరీ నిర్మాణానికి మంగళవారం భూమి పూజ చేశారు. అనంతరం మస్కాపూర్ మున్నూరుకాపు సంఘం భవనానికి రూ. 5లక్షల ప్రొసీడింగ్ అందించి భూమిపూజ చేశారు. మున్సి పల్ చైర్మన్ అంకం రాజేందర్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ గొర్రె గంగా ధర్, ఎంపీపీ మోహిద్, ఎంపీటీసీలు శనిగారపు రాణి, పుప్పాల స్వప్న, సర్పంచ్లు పార్శను శ్రీని వాస్, అడిదెల మహేందర్, ఉప సర్ప్ంచ్ నవీన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజగంగన్న, రామునాయక్, పుప్పాల గజేందర్, శనిగారపు శ్రావణ్, జన్నారం శంకర్, రాజరెడ్డి, ఆకుల వెంక గౌడ్, గాజుల గంగన్న, కౌట మహేశ్, అడిదెల మదు, తుప్ప నరేందర్, గ్రామస్తులు పాల్గొన్నా రు. మస్కాపూర్ గ్రామానికి చెందిన కమ్మల భూ మన్న రెండు రోజుల క్రితం మరణించగా బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే రేఖా నాయక్ పరామ ర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గోదావరి నది తీరాన గల బాదనకుర్తిలో ధ్యాన మందిరం ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ ధ్యాన కేంద్రం సభ్యులు ఎమ్మెల్యే రేఖానాయక్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీజీవో అధ్యక్షుడు శ్యాం నాయక్కు వినతిపత్రాన్ని అందించారు.
మైనార్టీ సెల్ కార్యవర్గాల ఎంపిక
ఖానాపూర్ మండలంతోపాటు, పట్టణ టీఆర్ఎస్ మైనార్టీ సెల్ కార్యవర్గాలను ఎమ్మెల్యే రేఖానాయక్ ఏకగ్రీవం గా ఎంపిక చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజగంగన్న, పట్టణ అధ్యక్షుడు పరిమి సురేశ్ నియామక పత్రాలను వారికి అందజేశారు. మం డల మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఖానాపూర్కు చెంది న షెడ్జిల్ హైమద్, పట్టణ అధ్యక్షుడిగా చెందిన మహ్మద్ షోయబ్ను ఎన్నుకున్నారు, కార్యదర్శులుగా అమాన్ఖాన్, షేక్ షకీల్, ఉపా ధ్యక్షులుగా అసిఫ్ అలీ, ఎస్కే షకీల్, సహాయ కార్యదర్శులుగా అజార్, సయ్యద్ పర్వేజ్, కోశాధి కారులుగా పసి ఉల్ హక్, జుబీర్ హైమద్, సభ్యు లుగా సయ్యద్ జుమేర్ హుస్సేన్, షేక్ నసీర్, రహీంఖాన్, షేక్ షమిల్ను ఎన్నుకున్నారు.