తాంసి, ఆగస్టు 2 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోయాచిక్కుడు పంట ప్రసుతం 35-50రోజుల (శాఖీయ-పూత ప్రారంభ) దశలో ఉందని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థా నం ప్రధాన శాస్త్రవేత్త(ఆగ్రోనమీ), ఇన్చార్జి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ తెలిపారు. ఈ పంట సాగుపై రైతులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నీటి ముంపు, మురుగు నీరు ఏర్పడడం వల్ల పంటలో ఎదుగుదల మందగించిందన్నారు. పోషక లోపాలు గమనించినట్లు తెలిపారు. లోపాల సవరణకు 19-19-19, 20-20-20, 13-0-45 నత్రజని, భాస్వరం, పొటాష్ను లీటరు నీటికి 10గ్రాములు లేదా యూరియా 20 గ్రాములు వారం రోజుల్లో రెండు సార్లు పిచికారీ చేయాలని సూచించారు.
కాండపు ఈగ(స్టేమ్ైప్లె), పెంకు పురుగు/కాండపు పురుగు ఆశిస్తే ఎకరాకు 10 కిలోల కార్బొఫ్యూరాన్ 3జి గుళికలు సరైన తేమలో వేయాలి. లేదా ఎకరాకు క్లోరాంతనిలిప్రోల్ 60మి.లీ లేదా బీటాసైప్లూథ్రిన్, నోవాల్యురాన్ 200 గ్రాములు లేదా పిచికారి చేయాలని సూచించారు.
పోగాకు లద్దెపురుగు, ఆకుముడుత/ ఆకుచుట్టు పురుగు ఆశిస్తే ఎకరాకు థయోడికార్బ్ 300 గ్రా. లేదా క్లోరిపైరిపాస్ 500 మి.లీ లేదా నోవాల్యురాన్ 200గ్రా. లాంటి మందులు ఒకటి రెండుసార్లు పిచికారీ చేయాలన్నారు.
సోయాచిక్కుడులో కాయలు ఏర్పడే లేదా గింజకట్టు దశలో భూమిలో సరైన తేమ ఉన్నప్పుడు ఎకరాకు 25-30 కిలోల యూరియా10 కిలోల పొటాష్ కలిపి మొక్కల దగ్గరగా వేయాలని సూచించారు.పైరు లేతదశలో వేరుకుళ్లు తెగులు ఆశించి మొక్కలు ఎండిపోయి, చనిపోయినట్లయితే లీట రు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2గ్రాముల కార్బండైజమ్, మాంకోజెబ్ మిశ్రమ మందును కలిపి మొక్కల చుట్టూ పోసి భూమిని తడపాలని వివరించారు.
సోయా చిక్కుడు విత్తనోత్పత్తి చేసే రైతులు మొ క్కల ఆకుల నిర్మాణం, ఎదుగుదలలో తేడా పూలరంగు గుణాలను దృష్టిలో పెట్టుకుని బెరుకులను తీసివేయాలని తెలిపారు. సమగ్ర పశువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యంతో పాటు సస్యరక్షణ చర్యలు పాటించడం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు.