బాసర, ఆగస్టు 3: రాష్ట్రంలో రైతులను ఆ దుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాల ను ప్రవేశ పెట్టిందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. బాసర ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని మంగళవారం ఎ మ్మెల్యే విడుదల చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ బాసర ఎత్తిపోతల పథకం ద్వారా రెండువేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు. ఈ ప్రాంత రైతుల పంటలకు ఉపయోగ పడేలా ఈ నీటిని విడుదల చేసినట్లు చె ప్పారు. సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకెళ్తున్నారని, రైతుబం ధు, రైతు బీమా, 24 గంటల కరెంట్ వంటి పథకాలు ఆయన ఘనతేనన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు లేవని పేర్కొ న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను స్థానిక నాయకులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వసంత రమేశ్, ఎంపీపీ సుశీలాబాయి, ఎంపీటీసీ ఉమారాణి, మండల ఉపాధ్యక్షుడు నర్సింగ్రా వు, నాయకులు బాబురావుపటేల్ తదితరులున్నారు.