ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 1: పేదలకు ఆపద లో అండగా నిలిచేందుకే సీఎంఆర్ఎఫ్ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జో గు రామన్న అన్నారు. పట్టణంలోని కైలాస్నగర్లో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 31మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.9.05 లక్షలు, 11 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.11,11,176 విలువైన చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ము ఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరిట ఆడబిడ్డల పెండ్లిళ్లకు రూ.1,00,116 అందిస్తూ, పేద కుటుంబాలకు కొండంత అండలా ప్రభుత్వం నిలుస్తున్నదని పేర్కొన్నారు. పేద కుటుంబాలు అప్పుల పాలు కా కుండా చూస్తున్నామన్నారు. ఆడబిడ్డలను బాగా చదివించాలని, కార్పొరేట్ స్థాయిలో గురుకులాలను ఏర్పాటు చేసి ఆంగ్ల మాధ్యమ విద్యను అం దిస్తున్నామన్నారు.
దళితుల అభివృద్ధికి రూ.10 వేల కోట్లతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తుంటే బీ జేపీ, కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక పథకాలు ఎన్నికల్లో ఇచ్చిన హా మీలు కావని గుర్తుచేసుకోవాలన్నారు. కాంగ్రెస్కు ఎవరూ దొరకనట్లు ఓటుకునోటు నిందితుడు రేవంత్రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారన్నా రు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడి సం క్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో ఆ పార్టీల నాయకులు చెప్పాలన్నారు. రాష్ట్రంలో గతంలో చేయనన్ని సంక్షేమ పథకాలు ప్రస్తుతం రాష్ట్రంలో అమలువుతుంటే వారికి మింగుడు పడడం లేదన్నారు. వైస్ఎంపీపీ రమేశ్, మార్కెట్ క మిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు జిట్టా ర మేశ్, సెవ్వ జగదీశ్, ఆరె నరేశ్, జంగు పటేల్, కౌ న్సిలర్లు భరత్, రామ్కుమార్ పాల్గొన్నారు.