కాగజ్నగర్ టౌన్, జూలై 29 : కాగజ్నగర్ పట్టణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం పాలక వర్గ సమావేశం నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల వర్షాలకు పట్టణంలో ఇబ్బందుల్లేకుండా ముందస్తు చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. త్వరలో మంత్రి కేటీఆర్ పర్యటన కాగజ్నగర్లో ఉంటుందని, మున్సిపాలిటీకి మరిన్ని నిధుల మంజూరుకు కృషి చేద్దామని తెలిపారు. వినయ్ గార్డెన్ నుంచి బాలాజీనగర్కు వెళ్లే రహదారికి మున్సిపల్ మాజీ చైర్మన్ గుల్లపల్లి బుచ్చిలింగం పేరు, చింతగూడ, కోయవాగు వంతెనను సందర్శిస్తామన్నారు. అంతకుముందు మాజీ కౌన్సిలర్ జానీమియా మృతి చెందడంతో రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, హరితహారం మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గిరీశ్ కుమార్, కమిషనర్ సీవీఎన్ రాజు, కౌన్సిల్ సభ్యులు, తదితరులు ఉన్నారు.
పారిశుధ్య కార్మికులకు దుప్పట్ల పంపిణీ..
మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, కమిషనర్ సీవీఎన్ రాజు గురువారం 141 మంది మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు, ఎల్ఈడీ బల్బులను గురువారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గిరీశ్ కుమార్, కౌన్సిలర్లు పిర్సింగుల జైచందర్, మదన్, వలీ, సాగరిక, ఎల్లేశ్, సునీల్, రాజేందర్, కోఆప్షన్ సభ్యులు దేవయ్య, తదితరులు ఉన్నారు.