రాష్ట్రంలో తొలిసారిగా..
ప్రయాణికుల కోసం నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ
ఎండల దృష్ట్యా అధికారుల నిర్ణయం
నిర్మల్ అర్బన్ / భైంసా, ఏప్రిల్ 16 : ప్రయాణికులను బస్ కోసం వేచి ఉండే ప్రదేశం నుంచి గమ్యస్థానం వరకు చేర్చడమే ఆర్టీసీ ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా డిపో అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేశారు. నిర్మల్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద, భైంసా పట్టణంలోని నిర్మల్ చౌరస్తా వద్ద తాత్కాలిక (బస్) షెల్టర్లను అధికారులు శుక్రవారం ప్రారంభించారు. ఈ బస్సులో సీట్లను ఏర్పాటు చేసి నీరు తాగేందుకు రంజన్లను సైతం సమకూర్చారు. కొవిడ్ దృష్ట్యా ప్రతిరోజూ బస్సులను శానిటైజ్ చేస్తామని బస్ డిపో మేనేజర్లు ఆంజనేయులు, రవీందర్ తెలిపారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా వివిధ పట్టణాలకు వెళ్లే ప్రయాణికులు ఈ బస్షెల్టర్లను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.