నిర్మల్ టౌన్, ఆగస్టు 3 : గొల్లకుర్మలకు ప్రభుత్వం సబ్సిడీపై అందించే గొర్రెల యూనిట్ పథకాన్ని పొందే పోషకదారులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. గొర్రెల ఒక యూనిట్ ధరను రూ.1.25లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు పెంచుతూ నిర్ణ యం తీసుకుంది. 2017లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నా యకత్వంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గొల్లకుర్మలకు ఆర్థిక స్వావలంబన అందించేందుకు సబ్సిడీ గొర్రెల పంపిణీ కా ర్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2018లో అన్ని జిల్లాల్లో మొ దటి విడుత సబ్సిడీ గొర్రెల పంపిణీ చేపట్టారు. నిర్మల్ జిల్లా లోని మూడు మున్సిపాలిటీలతో పాటు 18 మండలాల పరిధి లో 6,922 మందికి గొర్రెల యూనిట్లను మంజూరు చేసింది. నిర్మల్ జిల్లాలో విస్తారమైన భూ వనరులు, గొర్రెల పెంపకానికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ గొర్రెల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఒక్కొక్క యూనిట్కు రూ.1.25 లక్షలు కేటాయించగా.. అందులో 20 గొర్రెలతో పాటు ఒక పొట్టేలును ప్రభుత్వం యూనిట్ కింద మంజూరు చేసింది. ఈ గొర్రెలను మహారాష్టతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మొదటి విడుతలో పంపిణీ చేశారు. మొదటి విడుత కింద 6,922 మందికి సబ్సిడీ గొర్రెలను అందించారు. 2020లో రెండో విడుత కింద గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిం ది. దీంతో నిర్మల్ జిల్లా లో 7,200 మంది దర ఖాస్తు చేసు కున్నారు. వీరందరికీ సబ్సిడీ గొర్రెలను అందించేందుకు ప్రభు త్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.
మంత్రి అధ్యక్షతన సమావేశం..
ఇటీవల రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీని వాస్యాదవ్ అధ్యక్షతన అన్ని జిల్లాల పశు వైద్యాధి కారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. గొర్రెల యూనిట్ ధరను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచడమే కాకుం డా త్వరలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో ఉన్న యూనిట్ ధర గొర్రెల కొనుగోలుకు సరిపోయేవి. ఇప్పుడు గొర్రెలకు డిమాం డ్ ఏర్పడిన నేపథ్యంలో ధరలు పెరగడంతో ప్రభుత్వం యూ నిట్ రేటును కూడా పెంచడంపై గొర్రెల పెంపకందారులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు. డీడీలు చెల్లించిన వారందరికీ గొర్రె లు అందించేలా చూడాలని పెంపకందారులు కోరుతున్నారు.
చాలా సంతోషంగా ఉంది..
గొర్రెల యూనిట్ ధరను రూ.50 వేలు పెంచడం చాలా సంతోషంగా ఉంది. గతంలో రూ.1.25 లక్షలున్న యూని ట్ ధరను ఇప్పుడు రూ.1.75 లక్షలకు పెం చారు. రెండో విడుత కింద గొర్రెల పెంపకందారులకు కొత్త యూనిట్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం శుభపరిణామం. గొర్రెల పెంపకందారులైన మాకు ఎం తో ప్రయోజనం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గొర్రెల పెంపకందారులకు ప్రాధాన్యమిస్తూ సబ్సిడీ పథకాలను అందించడంతో ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నాం.
ముఖ్యమంత్రిపై విశ్వాసం ఉంది..
ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా అది అమలుచేస్తారు. 2020లో రెండో విడుత కింద గొర్రెల పెంపకానికి దరఖాస్తు చేసుకున్నా. ఇప్పుడు కొత్త యూనిట్లను మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. మాకు గొర్రెలు పెంచడమే తప్పా వేరే వృత్తి చేయలేము. అలాంటి గొర్రెల కాపరులకు ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి సబ్సిడీపై గొర్రెల యూనిట్లను మంజూరు చేస్తుండడం సంతోషంగా ఉంది. మాలాంటి వాళ్లకు మరింత ఉపాధి దొరుకుతుంది.