శ్రీరాంపూర్, ఆగస్టు 2 : సింగరేణిలో కార్మికుల పిల్లలకు కారుణ్యం ద్వారా ఉద్యోగాలు కల్పించిన ఘనత టీబీజీకేఎస్కే దక్కుతుందని ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నా రు. శ్రీరాంపూర్ ఏరియా గనులపై రాజిరెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం నాయకులు ఘనం గా నిర్వహించారు. ఎస్ఆర్పీ-3 గనిపై ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిం చిన వేడుకల్లో రాజిరెడ్డి పాల్గొని, కేక్ కట్ చేశారు. స్వీట్లు పం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదన్నారు. కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్, 61 ఏండ్లకు సర్వీస్ పెంచినట్లు చెప్పారు. దీంతో 43 వేల మంది కార్మికులకు లబ్ధిచేకూరుతున్నదన్నారు. అలాగే శ్రీరాంపూర్ కాలనీలో టీఆర్ఎస్ యూత్ నాయకు లు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో మిర్యా ల రాజిరెడ్డి కేక్ కట్ చేశారు. ఆ ర్కే-6 గనిపై ఏరియా చర్చల ప్రతినిధి వెంగల కుమారస్వామి, బ్రాం చి కార్యదర్శి పానగంటి సత్తయ్య కేక్ కట్ చేసి, జన్మదిన వేడుకలు నిర్వహించి కార్మికులకు స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి ఆర్ గోపాల్రెడ్డి, నాయకులు రమేశ్, సంపత్రెడ్డి, రాజేంద్రప్రసాద్, మహిపాల్రెడ్డి, మహేందర్రెడ్డి, శ్రీనివాసరావు, రాజేశ్వర్రావు, తిరుపతి, సాంబయ్య, ఉత్తేజ్రెడ్డి, నాగిరెడ్డి రాజిరెడ్డి, శ్రీనివాస్, నరేశ్ పాల్గొన్నారు.