ఖానాపూర్ టౌన్, ఆగస్టు 2 : ఎమ్మెల్యే రేఖా నాయక్పై ఏఎంసీ చైర్మన్ కడార్ల గంగ నర్సయ్య లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని, పద వీకాలానికి ఒక రోజు ముందు రాజీనామా చేయ డం సిగ్గు చేటు అని టీఆర్ఎస్ నాయకులు పేర్కొ న్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల స్థాయి నాయ కులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు రాజగంగ న్న మాట్లాడుతూ విశ్రాంత ఉపాధ్యాయుడిగా ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విషయా న్ని ఎమ్మెల్యే రేఖా నాయక్ గుర్తించి ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అప్ప గించారని పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్ పదవి కాలం ముగియడానికి ఒక రోజు ముందు కాంగ్రె స్ నాయకులతో సమావేశమై రాజీనామా ప్రకటిం చడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఆయన పద విలో ఉన్నంత కాలం ప్రభుత్వ పథకాలను రైతుల కు చేరవేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. అనవసరంగా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే సహిం చేది లేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ హయాం లోనే అన్నివర్గాలకు సమన్యాయం జరుగుతున్న దని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ అంకం రాజేం దర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, మాజీ జడ్పీటీసీ రాథోడ్ రామునాయక్, మండల ప్రధాన కార్యద ర్శి తూము చరణ్, పెంబి మండల అధ్యక్షుడు పుప్పల శంకర్, రైతు బంధు మండల కన్వీనర్ గజేందర్, నాయకులు జన్నారపు శంకర్, కొక్కుల ప్రదీప్, కొడిమ్యాల వీరేశ్, కౌట మహేశ్, శనిగా రపు శ్రావణ్, వెల్ముల శోభన్, నడిమట్ల కిష న్, గోగికార్ రాజు, పూసల మనోజ్, చింటు తదిత రులు పాల్గొన్నారు.