మాదాపూర్ : మాదాపూర్లోని హెచ్ఐసిసిలో సూత్ర ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న సినీనటి శ్రీజితగోష్, ప్రముఖమోడల్స్, నిర్వాహకులు మోనిక మద్యాన్, ఉమేష్ మద్యాన్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఇందులో భాగంగా నగరవాసులను ఆకర్శించే విధంగా సరికొత్త డిజైన్లతో కూడిన వస్త్రాలు, ఆభరణాలతోపాటు గృహోపకరణ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి గుర్తింపు పొందిన ప్రముఖ డిజైనర్లచే రూపొందించబడిన వస్తు, ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. కార్యక్రమ అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన మోడల్స్ ర్యాంప్వాక్ చేస్తు ఆకట్టుకున్నారు. సినీ నటి శ్రీజిత గోష్తో కలిసి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.