హైదరాబాద్: దేశంలో అత్యున్నత ఇంజినీరింగ్ విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. శనివారం నుంచి ప్రారంభంకావాల్సిన రిజిస్ట్రేషన్లు జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడిలో ఆలస్యం కావడంతో వాయిదాపడ్డాయి. దీంతో పరీక్షను నిర్వహిస్తున్న ఐఐటీ ఖరగ్పూర్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షెడ్యూల్లో మార్పులు చేసింది.
దీనిప్రకారం ఆగస్టు 13న (సోమవారం) దరఖాస్తులు ప్రారంభమవుతాయి. ఈనెల 19న సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్ గడువు ముగుస్తుంది. సెప్టెంబర్ 20 వరకు ఆన్లైన్లో ఫీజులు చెల్లించవచ్చు. పరీక్ష మాత్రం అక్టోబర్ 3న యధాతథంగా జరగనుంది. జేఈఈ మెయిన్ ఫలితాలు ఆది లేదా సోమవారాల్లో వెలువడే అవకాశం ఉంది. కాగా, మెయిన్ క్వాలిఫై అయిన 2.5 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి వీలుంది.