Tokyo Olympics 2020 | ఒలింపిక్స్ లో భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా ( Neeraj Chopra ) అదరగొట్టాడు. పురుషుల జావెలిన్ త్రో విభాగంలో నేరుగా ఫైనల్కు అర్హత సాధించాడు. బుధవారం జరిగిన గ్రూప్ ఏ క్వాలిఫికేషన్లో జావెలిన్ని 86.65 మీటర్ల దూరం పాటు జావెలిన్ను విసిరి అగ్రస్థానంలో నిలిచి ఏకంగా ఫైనల్కు అర్హత సాధించాడు. దీంతో జావెలిన్ విభాగంలో ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయుడుగా రికార్డు సృష్టించాడు. ఆగస్టు 7న జరిగే ఫైనల్లో టాప్ – 3లో నిలిస్తే ఏదో ఒక పతకం రావడం ఖాయంగా కనిపిస్తోంది.